ఢిల్లీలో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఫ్లాట్ కొనే ఉద్దేశంతో వివరాలు కనుక్కునేందుకు బాద్లీ ప్రాంతంలోని ఓ ప్రాపర్టీ డీలర్ కార్యాలయానికి ఆమె వెళ్లారు. అంతకు ముందే అక్కడ మరో ఇద్దరు పురుషులున్నారు. తాగేందుకు ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. అది తాగాక ఆమె స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహ వచ్చాక ఆమెకు అసలు విషయం తెలిసింది. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనకు స్పృహ కోల్పోయేలా చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె గ్రహించారు. షాక్కు గురైన ఆమె కేకలు పెడుతూ ప్రాపర్టీ కార్యాలయం నుంచి బయటకు పరిగెత్తారు. ఆమె కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి చేర్పించాక ఆమె అత్యాచారానికి గురైందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.
Subscribe to:
Post Comments (Atom)
- Popular
- Juke Box
- Category
Popular Posts
-
ఆదివాసుల దినోత్సవం రోజే ఓ గిరిజన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం, నాగులూటి చెంచుగూడెంలో ఓ మహిళపై ఏడుగురు ...
-
Srimanthudu First Day box Office Collections Worldwide : Srimanthudu First Day collections Total World Wide : Rs.34+ Crores (A...
-
మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ఎక్కడో దగ్గర వేధింపులకు గురవుతూనే వున్నారు. తాజాగా ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ...
-
ఏపీ సీఎం నారా చంద్ర బాబునాయుడుకు కొత్త క ష్టాలు వ చ్చి ప డ్డాయి . ఆయ న మంత్రులెవ్వ రూ ఇంగ్లీష్ లో అంత ప్రావీ...
0 comments:
Post a Comment