Andhrulamp3Andhrula mp3JntuJukeBoxLiveTvlatest

  • Latest News

    రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్ పర్యటన : చిరంజీవి


    రైతాంగం అప్పుల్లో మునిగిపోయిందని...వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకే జిల్లాలో రాహుల్పర్యటిస్తున్నారని కాంగ్రెస్పార్టీ ఎంపీ, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. రాహుల్పాదయాత్ర సందర్భంగా ఓబులదేవరచెరువు వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి మున్ముందు మంచి రోజులు వస్తాయని రాహుల్హామీ ఇచ్చారన్నారు.

    కాంగ్రెస్హయాంలో రైతాంగం ఎంతో సుఖమయంగా ఉందన్నారు. నేషనల్క్రైమ్బ్యూరో గణాంకాల ప్రకారం గత సంవత్సరకాలంలో రైతుల ఆత్మహత్యలు 35 శాతం పెరిగాయన్నారు. రైతు రుణమాఫీని రూ.80 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు కుదించి తూతూ మంత్రంగా రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని టీడీపీపై విమర్శలు గుప్పించారు. విమర్శించారు. రైతు రుణమాఫీ ఎవరికీ అందలేదన్నారు. రైతులకు వెనెముక్కగా నిలిచేది కాంగ్రెస్సే అని చిరంజీవి స్పష్టం చేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: రైతుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకే రాహుల్ పర్యటన : చిరంజీవి Rating: 5 Reviewed By: Andhrula Mp3
    Scroll to Top